Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన వ్యక్తిని ప్రేమించింది.. ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (10:19 IST)
పెళ్లైన వ్యక్తితో ప్రేమతో పడి.. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గన్నవరం పట్టణంలోని సినిమా హాళ్ల కూడలి సమీపంలో నివసిస్తున్న మొహ్మద్ జాస్మిన్ (20) బీటెక్ తొలి సంవత్సరం చదువుతోంది. 
 
ఈమెకు గన్నవరానికే చెందిన ఎస్కే జబీబుల్లా 27 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికి పెళ్లి కావడంతో పాటు భార్యాఇద్దరు పిల్లలు కూడా వున్నారు. అయితే జాస్మిన్, జబీబుల్లాల పరిచయం ప్రేమగా మారింది.
 
ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. అతడిని అనేక సార్లు హెచ్చరించారు. దీనికి తోడు రెండు రోజుల పాటు జబీబుల్లా ఫోన్ కూడా ఎత్తకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. 
 
వెంటనే జాస్మిన్ కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జబీబుల్లాను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments