Webdunia - Bharat's app for daily news and videos

Install App

హవాయి దీవిలో మంటలు: 36 మంది మృతి.. పలు ఇళ్లు దగ్ధం

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (19:14 IST)
మౌయి ద్వీపం యునైటెడ్ స్టేట్స్‌లోని హవాయి దీవులలో ఒకటి. ఈ దీవిలో భయంకరమైన మంటలు వ్యాపించాయి. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక పట్టణం లహైనాలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 12,000 మంది ప్రజలను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 
 
అడవి మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు సముద్రంలోకి దూకారు. వేగంగా వ్యాపిస్తున్న అడవి మంటల్లో 36 మంది చనిపోయారు. పలువురు ఈ మంటల్లో చిక్కుకుని గాయాలపాలైయ్యారు. 
 
హవాయి ద్వీపంలోని విమానాశ్రయంలో విమానాల రాకపోకలను రద్దు చేశారు. ద్వీపంలో రెండువేల మంది పర్యాటకులు ఆశ్రయం పొందినట్లు సమాచారం. 
 
హవాయి కన్వెన్షన్ సెంటర్ పర్యాటకులకు, స్థానికులకు ఒకే విధంగా వసతి కల్పించడానికి సిద్ధంగా ఉంచబడింది. అడవి మంటలను పూర్తి స్థాయిలో ఆర్పివేస్తున్నారు. రెస్క్యూ ప్రయత్నానికి సహాయం చేయాలని అధ్యక్షుడు జో-బైడెన్ సైన్యాన్ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments