Webdunia - Bharat's app for daily news and videos

Install App

హవాయి దీవిలో మంటలు: 36 మంది మృతి.. పలు ఇళ్లు దగ్ధం

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (19:14 IST)
మౌయి ద్వీపం యునైటెడ్ స్టేట్స్‌లోని హవాయి దీవులలో ఒకటి. ఈ దీవిలో భయంకరమైన మంటలు వ్యాపించాయి. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక పట్టణం లహైనాలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 12,000 మంది ప్రజలను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 
 
అడవి మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు సముద్రంలోకి దూకారు. వేగంగా వ్యాపిస్తున్న అడవి మంటల్లో 36 మంది చనిపోయారు. పలువురు ఈ మంటల్లో చిక్కుకుని గాయాలపాలైయ్యారు. 
 
హవాయి ద్వీపంలోని విమానాశ్రయంలో విమానాల రాకపోకలను రద్దు చేశారు. ద్వీపంలో రెండువేల మంది పర్యాటకులు ఆశ్రయం పొందినట్లు సమాచారం. 
 
హవాయి కన్వెన్షన్ సెంటర్ పర్యాటకులకు, స్థానికులకు ఒకే విధంగా వసతి కల్పించడానికి సిద్ధంగా ఉంచబడింది. అడవి మంటలను పూర్తి స్థాయిలో ఆర్పివేస్తున్నారు. రెస్క్యూ ప్రయత్నానికి సహాయం చేయాలని అధ్యక్షుడు జో-బైడెన్ సైన్యాన్ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments