ఎయిర్‌పోర్టు అధికారుల కళ్ళగప్పి ఫ్లైట్ చక్రాల్లో దాక్కుని ప్రయాణం..

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (10:23 IST)
సాధారణంగా రైళ్లు, బస్సుల్లో దొంగతనంగా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా, రైళ్ళలో అయితే, బాత్రూమ్‌లు సీట్ల కింద దాక్కొని ప్రయాణం చేయొచ్చు. కానీ, విమానాల్లో మాత్రం అలా సాధ్యపడదు. కానీ, ఓ ప్రయాణికుడు మాత్రం ఎయిర్‌పోర్టు అధికారుల కళ్లుగప్పి.. ఏకంగా 1640 కిలోమీటర్ల మేరకు ప్రయాణించాడు. ఈ విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చిన తీరు చూసి ఎయిర్‌పోర్టు గ్రౌండ్ సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్యాటెమాల సిటీ నుంచి మియామీకి ఒక విమానం బయలుదేరింది. ఈ విమానం ల్యాండింగ్ గేర్ బాక్స్ లోపల కూర్చొని ఏకంగా 1,640 కిలోమీటర్ల దూరంపాటు నాలుగైదు గంటలు కూర్చొని ప్రయాణం చేశాడు. 
 
ఆ విమానం మియామీలో ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రయాణికుడు బయటకు రాగా, గ్రౌండ్ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, అలా ప్రయాణించిన ప్రయాణికుడి వివరాలు వెల్లడికాలేదు. అతని వద్ద ఎయిర్ పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments