అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా... ఓ మహిళ - బాబు మృతి

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (16:39 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తూటా పేలింది. గురువారం జరిగిన ఈ కాల్పుల్లో ఓ మహిళతోపాటు ఏడాది బాబు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికా, ఫ్లోరిడాలోని రాయల్ పామ్ బీచ్‌లో ఉన్న పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్‌లో గురువారం రోజు ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. 
 
ఈ దాడిలో వృద్ధ మహిళ సహా ఏడాది వయసున్న ఆమె మనవడు తీవ్రంగా గాయపడ్డి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కాల్పులకు పాల్పడ్డ సదరు దుండగుడు సైతం తనను తాను కాల్చుకుని మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడు ఏ కారణం చేత కాల్పులకు పాల్పడ్డాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇదిలావుంటే, ఫ్లోరిడాలో గత ఆదివారం కూడా ఓ దుండగుడు కాల్పులకు తెలగబడిన విషయం తెల్సిందే. మియామిలోని జరిగే గ్రాడ్యూయేషన్ పార్టీలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గరు మరణించగా.. ఐదుగురు గాయపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments