Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తెరపైకి వేలుపిళ్లై ప్రభాకరన్... సంచలనంగా మారిన ఆయన వ్యాఖ్యలు...

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (15:06 IST)
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా జీవించే ఉన్నారట. పైగా, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారని ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు పళ నెడుమారన్ చెప్పారు. అందువల్ల ప్రభారకన్‌కు తమిళనాడు ప్రభుత్వంతో పాటు తమిళ ప్రజలు అండగా నిలబడలాని ఆయన కోరారు. 
 
తంజావూరులోని ముల్లివైక్కల్ మెమోరియల్‌లో ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ చనిపోలేదని, ఆయన ఇంకా జీవించే ఉన్నారని, త్వరలోనే ఆయన బాహ్య ప్రపంచంలోకి వస్తారని తెలిపారు. తమిళుల మెరుగైన జీవనంపై ఆయన ఓ ప్రకటన చేయనున్నారని తెలిపారు. 
 
పైగా, కుటుంబ సభ్యులతో కూడా ప్రభాకరన్ టచ్‌లోనే ఉన్నారని చెప్పారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారని చెప్పారు. అయితే, ప్రభాకరన్ ఎక్కడ ఉన్నారనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ప్రభాకరన్‌కు ఈలం తమిళుడు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళుల మద్దతు కావాలని ఆయన కోరారు. 
 
కాగా, గత 2009 మే 19వ తేదీన ప్రభాకరన్ చనిపోయారని శ్రీలంక ఆర్మీ ప్రకటించిన విషయం తెల్సిందే. పైగా, ప్రభాకరన్ మృతదేహం ఫోటోలను కూడా లంక ఆర్మీ విడుదలచేసింది. తమ చేతిలో ప్రభాకరన్‌తో పాటు ఆయన కుమారుడు చనిపోయారని ప్రకటించింది. కానీ, పళనెడుమారన్ మాత్రం తద్విరుద్ధంగా ప్రకటించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments