Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా కన్ను.. కామెంగ్ నదిలో కరిగే వ్యర్థాలు

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (15:47 IST)
fish
భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని తన దేశంలో కలిపేసుకొవాలని చూస్తున్నది. లద్దాఖ్ లో కిరికిరి చేస్తూనే, చైనా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌లో బలగాలను మొహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 
 
అయితే, చైనా ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తుంది. చైనా నుంచి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించే నదులను కలుషితం చేస్తుంది. దీనివలన నదులు నల్లగా మారిపోతున్నాయి. అందులో నివసించే చేపలు, ఇతర జీవులకు ఆక్సీజన్ అందక వేల సంఖ్యలో మరణిస్తున్నాయి.
 
చైనా బోర్డర్‌లో పెద్ద ఎత్తున కట్టడాలను నిర్మిస్తుంది. ఈ కట్టడాల వ్యర్థాలను నదిలో కామెంగ్ నదిలో కలిపేస్తుంది. ఫలితంగా నదిలోని నీరు మొత్తం నల్లగా మారిపోయింది. సాధారణంగా లీటర్ నీటిలో కరిగే వ్యర్థాల పరిమాణం 300 మిల్లీ గ్రాముల నుంచి 1200 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. 
 
కానీ, కామెంగ్ నదిలో కరిగే వ్యర్థాలు 6800 మిల్లీ గ్రాముల వరకు ఉంటోంది. దీంతో నది మొత్తం నల్లగా మారిపోయి దేనికి పనికి రాకుండా పోతుంది. ఎగువ ప్రాంతంలో చైనా కట్టడాలు నిర్మిస్తూ వాటి వ్యర్థాలను పెద్ద సంఖ్యలో కామెంగ్ నదిలో కలిపేస్తుందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments