లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ దాడి...

ఠాగూర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (11:20 IST)
లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ దాడి జరిగింది. గత 2011 నుంచి లిబియాలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ ప్రాంతం తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయి పాలన సాగుతుంది. 2014లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్రభుత్వాన్ని తూర్పు ప్రాంత పార్లమెంట్ గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా నివాసంపై సోమవారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని మంత్రి ఒకరు తెలిపారు. ఈ రాకెట్ దాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మొహరించాయి. 
 
2011 నుంచి లిబియాలో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. పాలన కూడా రెండు వర్గాల చేతుల్లో ఉంది 2014లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయిన వర్గాలు ఎవరికి వారే పాలించుకుంటున్నారు. సమస్యను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి 2021లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలోని నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ ఆయనను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించడంతో లిబియా దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments