కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

Webdunia
బుధవారం, 17 జులై 2019 (18:51 IST)
అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో భారత పౌరుడు కుల్‌భూషణ్ యాదవ్‌కు పాకిస్థాన్ కోర్టు విధించిన మరణశిక్షను నిలిపివేసింది. పైగా, ఈ శిక్షను పునఃసమీక్షించాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ది హేగ్‌లోని అంతర్జాతీయ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. మొత్తం 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పునివ్వగా, ఒక్క జడ్జి మాత్రం వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. 
 
గూఢచర్యం ఆరోపణలపై 2016లో కుల్‌భూషణ్‌ యాదవ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేసింది. ఈ కేసులో 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెల్సిందే. కుల్‌భూషణ్‌ యాదవ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడమే కాకుండా, అతనికి మరణశిక్షను పాక్ సైనిక కోర్టు విధించింది. యాదవ్ పెట్టుకున్న క్షమాభిక్షను కూడా తోసిపుచ్చారు. 
 
దీంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ఐసీజే మరణశిక్షను రద్దు చేసింది. అదేసమయంలో జాదవ్‌ కేసును పునఃసమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments