Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

Webdunia
బుధవారం, 17 జులై 2019 (18:51 IST)
అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో భారత పౌరుడు కుల్‌భూషణ్ యాదవ్‌కు పాకిస్థాన్ కోర్టు విధించిన మరణశిక్షను నిలిపివేసింది. పైగా, ఈ శిక్షను పునఃసమీక్షించాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ది హేగ్‌లోని అంతర్జాతీయ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. మొత్తం 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పునివ్వగా, ఒక్క జడ్జి మాత్రం వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. 
 
గూఢచర్యం ఆరోపణలపై 2016లో కుల్‌భూషణ్‌ యాదవ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేసింది. ఈ కేసులో 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెల్సిందే. కుల్‌భూషణ్‌ యాదవ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడమే కాకుండా, అతనికి మరణశిక్షను పాక్ సైనిక కోర్టు విధించింది. యాదవ్ పెట్టుకున్న క్షమాభిక్షను కూడా తోసిపుచ్చారు. 
 
దీంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ఐసీజే మరణశిక్షను రద్దు చేసింది. అదేసమయంలో జాదవ్‌ కేసును పునఃసమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments