Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లి చికెన్ వండలేదని భార్యను కొడవలితో నరికి చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (16:15 IST)
క్షణికావేశాలతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా చిల్లి చికెన్ వండలేదని భార్యను ఓ కిరాతక భర్త కడతేర్చిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దావణగెరె జిల్లా హరిహర ప్రాంతంలో కెంచప్ప, షీలా దంపతులు నివాసం వుంటున్నారు.
 
8 ఏళ్ల క్రితం ప్రేమించి వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె వుంది. ఇటీవల భార్యపై అనుమాంతో కెంచప్ప భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అయితే ప్రస్తుతం పుట్టింటి దగ్గర ఉంటున్న షీలా.. బుధవారం రాత్రి కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన భర్త వద్దకు వచ్చింది. 
 
ఈ క్రమంలో తాగి వున్న కెంచప్ప చికెన్ కూర (చిల్లి చికెన్) వండాలని భార్యకు భర్త చెప్పాడు. అయితే ఆమె వండలేదు. దీంతో గొడవ జరిగింది. మద్యం మత్తులో వున్న కెంచప్ప.. కొడవలితో భార్యను దారుణంగా నరికి చంపాడు. మత్తు దిగిన తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు. 
 
దీంతో పోలీసులు కెంచప్పను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments