Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లి చికెన్ వండలేదని భార్యను కొడవలితో నరికి చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (16:15 IST)
క్షణికావేశాలతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా చిల్లి చికెన్ వండలేదని భార్యను ఓ కిరాతక భర్త కడతేర్చిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దావణగెరె జిల్లా హరిహర ప్రాంతంలో కెంచప్ప, షీలా దంపతులు నివాసం వుంటున్నారు.
 
8 ఏళ్ల క్రితం ప్రేమించి వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె వుంది. ఇటీవల భార్యపై అనుమాంతో కెంచప్ప భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అయితే ప్రస్తుతం పుట్టింటి దగ్గర ఉంటున్న షీలా.. బుధవారం రాత్రి కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన భర్త వద్దకు వచ్చింది. 
 
ఈ క్రమంలో తాగి వున్న కెంచప్ప చికెన్ కూర (చిల్లి చికెన్) వండాలని భార్యకు భర్త చెప్పాడు. అయితే ఆమె వండలేదు. దీంతో గొడవ జరిగింది. మద్యం మత్తులో వున్న కెంచప్ప.. కొడవలితో భార్యను దారుణంగా నరికి చంపాడు. మత్తు దిగిన తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు. 
 
దీంతో పోలీసులు కెంచప్పను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments