Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లి చికెన్ వండలేదని భార్యను కొడవలితో నరికి చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (16:15 IST)
క్షణికావేశాలతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా చిల్లి చికెన్ వండలేదని భార్యను ఓ కిరాతక భర్త కడతేర్చిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దావణగెరె జిల్లా హరిహర ప్రాంతంలో కెంచప్ప, షీలా దంపతులు నివాసం వుంటున్నారు.
 
8 ఏళ్ల క్రితం ప్రేమించి వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె వుంది. ఇటీవల భార్యపై అనుమాంతో కెంచప్ప భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అయితే ప్రస్తుతం పుట్టింటి దగ్గర ఉంటున్న షీలా.. బుధవారం రాత్రి కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన భర్త వద్దకు వచ్చింది. 
 
ఈ క్రమంలో తాగి వున్న కెంచప్ప చికెన్ కూర (చిల్లి చికెన్) వండాలని భార్యకు భర్త చెప్పాడు. అయితే ఆమె వండలేదు. దీంతో గొడవ జరిగింది. మద్యం మత్తులో వున్న కెంచప్ప.. కొడవలితో భార్యను దారుణంగా నరికి చంపాడు. మత్తు దిగిన తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు. 
 
దీంతో పోలీసులు కెంచప్పను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments