Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీ గగనతలంలో విమాన రాకపోకలపై నిషేధాజ్ఞలు... పాక్ కీలక నిర్ణయం

యూరీ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ఓడరేవు పట్టణమైన కరాచీ గగనతలంపై విమానరాకపోకలను పూర్తిగా

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:41 IST)
యూరీ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ఓడరేవు పట్టణమైన కరాచీ గగనతలంపై విమానరాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. పాక్ సర్కారు నోటామ్ (నోటీస్ టు ఎయిర్ మెన్) విడుదల చేస్తూ, కరాచీ గగనతలంపై 33 వేల అడుగులకన్నా తక్కువ ఎత్తులో విమాన ప్రయాణాలు నిషేధమని తెలిపింది. కరాచీ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (ఎఫ్ఐఆర్) సేవలు అందవని తెలిపింది. 
 
కాగా, గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులకు కూతవేటు దూరంలోనే ఉండే కరాచీ నగరంపై నుంచి ఎన్నో విమానాలు వెళుతుంటాయి. నాగపూర్, భువనేశ్వర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చే సర్వీసులన్నీ ఇదే మార్గంలో ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఇవన్నీ ఏదో ఒకదశలో కరాచీ ఎఫ్ఐఆర్‌తో సంబంధాన్ని కొనసాగిస్తాయి. ఇక కరాచీ అందుబాటులో లేని వేళ, ఢిల్లీ ఎఫ్ఐఆర్ పరిధిలోకి వచ్చే ముందు ఇరాన్, ఆప్ఘనిస్థాన్‌లోని ఎయిర్ పోర్టుల్లోని ఎఫ్ఐఆర్‌లతో సంబంధం పెట్టుకోవాల్సి వుంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments