Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్ గురుద్వారాపై దాడి.. కేరళ వ్యక్తి ఫోటోను విడుదల చేసిన ఐసిస్

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (20:28 IST)
కాబూల్‌లోని గురుద్వారాపై జరిగిన ఉగ్రదాడిలో 25మంది మృతి చెందారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో ఒకడైన సూసైడ్ బాంబర్ అబు ఖాలిద్ అల్ హింది ఫోటోను ఐసిస్ శుక్రవారం విడుదల చేసింది. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరేందుకు నాలుగేళ్ల క్రితం కేరళ నుంచి పరారైన 14 మందిలో ఇతడు కూడా ఉన్నాడు. 
 
ఇతడు కేరళ కసర్‌గడ్‌లోని పడ్నె ప్రాంతానికి చెందిన షాప్‌కీపర్. అల్ హింది అసలు పేరు మొహమ్మద్ సాజిద్. 2016లో అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయింది. 
 
జూలై 2016లో కసర్‌గడ్‌కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల తన కుమారుడు అబ్దుల్ రషీద్, అతడి భార్య అయిషా, చిన్నారితో ముంబై వెళ్లాడని, గత రెండు నెలలుగా వారు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సాజిద్ సహా మరో 14 అదృశ్యమైనట్టు కేసులు నమోదయ్యాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో వీరంతా ఐసిస్‌లో చేరేందుకు వెళ్లినట్టు తేలింది. 
 
అబ్దుల్ రషీద్ సహా వారందరినీ ఐసిస్ చేర్చుకుంది. కాబూల్‌లోని గురుద్వారాపై మూడు రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో కేరళకు చెందిన 30 ఏళ్ల షాప్‌కీపర్ ఉన్నట్టు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments