Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో రాత్రిపూట ఆఫీసుల్లో లైట్లు ఆపాల్సిందే.. వారంలో మూడు రోజులు సెలవు.. యాహూ

జపాన్ ప్రజలు కష్టజీవులు డబ్బు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. జపాన్‌లో ఉద్యోగులు కష్టపడినంతగా ఏ దేశంలోనూ ఉద్యోగులు శ్రమించరనే చెప్పాలి. ఆఫీసుల్లోనే పనిచేసుకుంటూ.. అక్కడే తిని.. అక్కడే నిద్రపోయే ఉద్యో

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (14:09 IST)
జపాన్ ప్రజలు కష్టజీవులు డబ్బు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. జపాన్‌లో ఉద్యోగులు కష్టపడినంతగా ఏ దేశంలోనూ ఉద్యోగులు శ్రమించరనే చెప్పాలి. ఆఫీసుల్లోనే పనిచేసుకుంటూ.. అక్కడే తిని.. అక్కడే నిద్రపోయే ఉద్యోగులకు ఇకపై ఉపశమనం లభించనుంది. ఈ క్రమంలో జపాన్‌లోని యాహూ సంస్థ తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి వారంలో మూడు రోజులు సెలవు ఇవ్వాలని నిర్ణయించుకుంది. 
 
ఆఫీసుల్లోనే నిద్రపోతూ.. ఓవర్‌టైమ్ చేసుకుంటూ గడిపే వారిలో మానసిక ప్రశాంతత కొరవడుతోంది. ఇటీవల ఒక యాడ్‌ ఏజెన్సీలో పనిచేసే 24ఏళ్ల యువతి ఉద్యోగంలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే దాన్ని జపాన్‌లో 'కరోషి'గా పిలుస్తారు. ఇలాంటి సంఘటనలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రాత్రిళ్లు ఆఫీసుల్లో లైట్లు ఆఫ్‌ చేయాలని సంస్థలకు ఆదేశాలిచ్చింది. వచ్చే నెల నుంచి ఉద్యోగులు ప్రతినెల చివరి శుక్రవారం తొందరగా ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనుంది.
 
అయితే.. జపాన్‌లోని యాహూ సంస్థ మరో అడుగుముందుకేసి వారంలో మూడురోజులు సెలవు దినాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2020నాటికి తమ ఉద్యోగులకు దీన్ని అమలు చేయాలని నిర్ణయించుకుందట. దీని వల్ల ఉద్యోగులకు ప్రశాంతత లభించడమే కాకుండా.. చేసే పనిని మరింత బాగా ఎలా చేయాలో నేర్చుకుంటారని... పనితనం మెరుగవుతుందని యాహూ సంస్థ తెలిపింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments