Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూరి హత్య కేసు ఏమౌతుంది..? బెయిల్ కోసం దరఖాస్తు.. రూ.200 కోట్ల రాజీ కుదిరిందా?

ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం ఎమ్మెల

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (13:36 IST)
ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. సూరి హత్య జరిగి ఐదేళ్లు (2011) కావస్తోంది. భానుకిరణ్ సూరి హత్యలో ప్రధాన నిందితుడు.
 
తన భర్త హత్యతో వంశీకి ప్రమేయం ఉందంటూ సూరి భార్య గంగుల భానుమతి గతంలో తీవ్ర ఆరోపణలు చేయడంతో కోర్టు వంశీకి సమన్లు పంపింది. గతంలో రాంగోపాల్ వర్మ ఇదే ఇతివృత్తపు నేపథ్యంలో 'రక్తచరిత్ర' సినిమా నిర్మించారు. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సూరి భార్య భానుమతి- భాను కిరణ్‌ల మధ్య 200కోట్లతో రాజీ కుదర్చడానికి చర్చలు జరుగుతున్నట్లు 2015లోనే ఒక ఇంగ్లీష్ దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.
 
భానుకిరణ్ తరపున కొంతమంది మధ్యవర్తులు సూరి భార్యతో సంప్రదింపులు జరిపారని సదరు వార్తా కథన సారాంశం. ఇదిలావుండగా భానుకిరణ్ శత్రువులనుంచి ప్రమాదం వుందంటూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments