డొనాల్డ్ ట్రంప్ అక్రమ సంబంధం.. అందుకే తొలి భార్య విడాకులు తీసుకుంది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి భార్య ఆయన అక్రమ సంబంధం గురించి ఓ పుస్తకంలో వెల్లడించారు. ఓ వైపు తనతో కాపురం చేస్తూ మరోవైపు అక్రమ సంబంధాన్ని నడిపినందునే తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైందని ట్రంప్

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (12:16 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి భార్య ఆయన అక్రమ సంబంధం గురించి ఓ పుస్తకంలో వెల్లడించారు. ఓ వైపు తనతో కాపురం చేస్తూ మరోవైపు అక్రమ సంబంధాన్ని నడిపినందునే తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైందని ట్రంప్ తొలి భార్య తెలిపారు. ప్రేమ, పెళ్లి, విడాకుల వరకూ జరిగిన సంఘటనలపై ఆమె 'రైజింగ్ ట్ర్రంప్' పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. వచ్చే వారంలో మార్కెట్లోకి విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇవానా పలు కీలక విషయాలను తెలిపారు.
 
తన పెళ్లి బంధం ముగియనుందని డిసెంబర్ 1989లోనే తెలుసుకున్నానని ఇవానా ఈ పుస్తకంలో తెలిపింది. ఓ రోజు ఓ అమ్మాయి తన ఇంటికి వచ్చి.. తన పేరు మార్లా అని పరిచయం చేసుకుందని వెల్లడించినట్లు ఇవానా చెప్పుకొచ్చారు. తన భర్తను ప్రేమిస్తున్నానని తెలిపిందని.. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా అరిచానని ఇవానా తెలిపారు. భర్తంటే తనకెంతో ప్రేమని చెప్పానని, కానీ ఆ షాక్ నుంచి మాత్రం తేరుకోలేక పోయానన్నారు. 
 
ఓ రెస్టారెంట్ లో పరిచయం అయిన ట్రంప్, తనను ఎంతో బాగా చూసుకునేవారని, అయితే, మార్లాతో ట్రంప్ అక్రమ సంబంధం పెట్టుకున్న తరువాత మాత్రం తన మనసు వికలమైందని తెలిపారు. తామిద్దరం విడిపోయిన తరువాత తమ బిడ్డ డొనాల్డ్ జూనియర్, చాలా కాలం తండ్రితో మాట్లాడలేదని, ప్రస్తుతం తామిద్దరం స్నేహితుల్లా ఉన్నామని అన్నారు. ట్రంప్‌కు బదులు తన కుమార్తె ఇవాంకా ట్రంప్ అమెరికాకు అధ్యక్షురాలైతే బాగుండేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments