Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసిస్ దారుణ చర్య.. అమెరికా సైన్యాన్ని అడ్డుకునేందుకు సల్ఫర్ గని బ్లాస్ట్...

ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) తనకు చిన్నపాటిహాని జరిగినా.. ఎలాంటి దారుణానికైనా పాల్పడేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. తాజాగా అమెరికా సైన్యాన్ని అడ్డుకునేందుకు ఏక

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (11:37 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) తనకు చిన్నపాటిహాని జరిగినా.. ఎలాంటి దారుణానికైనా పాల్పడేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. తాజాగా అమెరికా సైన్యాన్ని అడ్డుకునేందుకు ఏకంగా సల్ఫర్ గనినే పేల్చివేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఇరాక్‌లోని మోసుల్ నగరాన్ని తిరిగి హస్తగతం చేసుకునేందుకు అమెరికా సారథ్యంలోని అమెరికా, ఇరాక్ సంయుక్త దళాలు మోసుల్ నగరాన్ని చుట్టుముట్టి, ఒక్కో ఉగ్రవాదినీ మట్టుపెడుతూ ముందుకు దూసుకెళుతున్నాయి. దీంతో ఈ బలగాలను అడ్డుకునేందుకు ఇసిస్.. ఆ ప్రాంతంలో ఉన్న సల్ఫర్ గనిని పేల్చింది. దీంతో వెలువడిన విషవాయువులను పీల్చి వేలాది మంది సాధారణ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
ఈ విషయం తెలుసుకున్న భద్రతా అధికారులు.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. సైన్యంలోని ప్రతి ఒక్కరూ మాస్క్‌లను ధరించే ముందుకు సాగాలని ఆదేశించారు. మౌసుల్‌కు 25 మైళ్ల దూరంలోని ముషారఖ్ సల్ఫర్ గనిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేల్చినట్టు ఇరాకీ ఫెడరల్ పోలీసు ప్రతినిధి కల్నల్ అబ్దుల్ రహమాన్ అల్ ఖాజాలి తెలిపారు. ఉగ్రవాదుల నుంచి నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఐదు రోజుల నుంచి భీకర పోరు జరుగుతోందని ఆయన తెలిపారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments