Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ నోట్ల పంపిణీ సరఫరాదారు.. కాట్మండులో హతం

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (17:57 IST)
భారత్ లో నకిలీ నోట్లను పంపిణీ చేసే అతి పెద్ద సరఫరాదారు.. పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటిలెజెన్స్ (ఐఎస్ఐ) ఏజెంట్ నేపాల్ లో హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాట్మండూలో నక్కిన అతడు తన ఇంటిముందే ఇద్దరు దుండగుల చేతిలో హతమయ్యాడు. సెప్టెంబర్ 19న ఈ ఘటన జరిగినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
 
నిఘా వర్గాల కథనం ప్రకారం.. హతుడు పేరు లాల్‌ మహమ్మద్‌(55). అతడు ఐఎస్‌ఐ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఐఎస్‌ఐ ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు అక్రమంగా నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్నాడు. 
 
బంగ్లాదేశ్‌, నేపాల్ మీదుగా భారత్‌లోకి నకిలీ నోట్లను తరలిస్తున్నాడు. మహమ్మద్‌కు అండర్‌వరల్డ్ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు చెందిన గ్యాంగ్‌తోనూ సంబంధాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 
 
కాట్మండూలో ఉంటున్న అతడిని ఇంటి ఎదుటే ఇద్దరు దుండగులు వెంటాడి కాల్చిచంపారు. తర్వాత వారు ఘటనా స్థలం నుంచి పారిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments