Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్.. ఈసారి ఇరాన్ వంతు.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (15:51 IST)
భారత్‌ తరహాలో పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. మరోదేశం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌ జరిపింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై తాజాగా ఇరాన్‌ మెరుపు దాడులు నిర్వహించింది. కొన్నిరోజుల క్రితం భారత దేశం నిర్వహించిన మాదిరిగానే మెరుపుదాడులు( సర్జికల్‌ స్ట్రైక్‌ ) చేసింది. ఇరాన్‌ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్‌ దళం( ఐఆర్‌జేసీ) దీనిని నిర్వహించింది. 
 
గత కొంత కాలంగా బెలూచిస్తాన్‌లో చెరలో ఉన్న తమ సైనికులిద్దరిని విడిపించుకు వెళ్లేందుకు ఇరాన్‌ ఈ మెరుపుదాడి నిర్వహించినట్టు ఐఆర్‌జేసీ వెల్లడించింది. బెలూచిస్తాన్‌లోని జైష్‌ ఉల్‌ అదల్‌ అనే ఉగ్రవాద సంస్ధ 2018లో 12 మంది ఇరాన్‌ సైనికులను అపహరించింది. ఈ ముఠా ఇరాన్‌కు వ్యతిరేకంగా సాయుధ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది.
 
ఇరాన్‌ సైనికులను విడిపించడానికి ఒక కమిటీని ఏర్పాటు అయ్యింది. తాజాగా ఇరాన్‌ నిర్వహించిన మెరుపుదాడిలో ఇద్దరు బందీలను ఇరాన్‌ విడిపించుకు వెళ్లింది. బెలూచిస్తాన్‌కు చెందిన జైష్‌ ఉల్‌అదల్‌ ఉగ్రవాద సంస్థ ఇరాన్‌ సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిని అపహరించి పాకిస్తాన్‌కు తరలించుకుపోయిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments