విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన మరో భారీ ప్రమాదం

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (11:31 IST)
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతుండటంతో విమాన ప్రయాణీకుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇటీవలే వరుసగా బోయింగ్ విమానాలు కూలిపోతున్న ఘటనలు జరుగగా తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది.


విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో దాదాపు 100 మంది ప్రయాణీకులు అందులో ఉన్నారు. సకాలంలో స్పందించిన సిబ్బంది వెంటవెంటనే ప్రయాణీకులను కిందికి దించేసారు.
 
ఇరాన్ ఎయిర్ కంపెనీకి చెందిన ఫాకర్ 100 విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక కారణాలతో వెనుకవైపు ఉండే ల్యాండింగ్ గేర్ సకాలంలో తెరుచుకోకపోవడం వల్ల మంటలు చెలరేగినట్లు తెలిపారు. వెంట వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ హాని  జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాల కోసం మరింత లోతైన దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments