Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతిమయాత్రలో తొక్కిసలాట... 35 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (17:56 IST)
ఇరాన్ సైనిక దళానికి చెందిన అగ్రనేత ఖాసీం సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 35 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా డ్రోన్ల దాడిలో సులేమానీ ఇటీవల మృతి చెందిన విషయం తెల్సిందే. ఈయన అంత్యక్రియల్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. 
 
అమెరికా రాకెట్ దాడిలో హతమైన సులేమానీ అంత్యక్రియలు కెర్ మన్ పట్టణంలో జరిగాయి. తమ అభిమాన వ్యక్తి పార్థివ దేహాన్ని చూసేందుకురావడంతో జనం ఒక్కసారిగా తోసుకునిరావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇందులో 35 మంది మరణించగా, 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఇరాన్ టీవీ అధికారికంగా ప్రకటించింది. 
 
మరోవైపు, ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ సులేమానీ సహా మరో ఐదుగురు అధికారులను డ్రోన్‌ దాడితో అమెరికా సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. తమ అభిమాన అధికారిని అమెరికా హత్య చేయడంతో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఇరాన్‌ హెచ్చరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments