Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతిమయాత్రలో తొక్కిసలాట... 35 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (17:56 IST)
ఇరాన్ సైనిక దళానికి చెందిన అగ్రనేత ఖాసీం సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 35 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా డ్రోన్ల దాడిలో సులేమానీ ఇటీవల మృతి చెందిన విషయం తెల్సిందే. ఈయన అంత్యక్రియల్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. 
 
అమెరికా రాకెట్ దాడిలో హతమైన సులేమానీ అంత్యక్రియలు కెర్ మన్ పట్టణంలో జరిగాయి. తమ అభిమాన వ్యక్తి పార్థివ దేహాన్ని చూసేందుకురావడంతో జనం ఒక్కసారిగా తోసుకునిరావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇందులో 35 మంది మరణించగా, 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఇరాన్ టీవీ అధికారికంగా ప్రకటించింది. 
 
మరోవైపు, ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ సులేమానీ సహా మరో ఐదుగురు అధికారులను డ్రోన్‌ దాడితో అమెరికా సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. తమ అభిమాన అధికారిని అమెరికా హత్య చేయడంతో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఇరాన్‌ హెచ్చరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments