Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా బాండా సముద్రతీరంలో భారీ భూకంపం... వణికిపోతున్న ప్రజలు

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (08:44 IST)
ఇండోనేషియా దేశంలోని బాండా సముద్ర తీరంలో భారీ భూకంపం సంభవించింది. ఇది భూకంపలేఖినిపై 6.7గా నమోదైంది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. అయితే, ఈ భూకంప ప్రభావం కారణంగా సునామీ వచ్చే అవకాశాలు లేవని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. ఇండోనేషియా ప్రజలు వరుస భూకంపాల భయంతో వణికిపోతున్నారు.
 
తాజాగా అంటే బుధవారం రాత్రి 8.02 గంటల సమయంలో 6.7 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ప్రభావం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టంచేసింది. మరోవైపు, మంగళవారం ఉదయం 11.5. గంటల సమయంలో కూడా తనింబార్ దీవుల్లోని సౌమ్లాకి పట్ణంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, దీని కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. 
 
కాగా, భూకంప భయాలు ఇండోనేషియాన వెంటాడుతుంటాయి. ఈ దేశం ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం జపాన్ నుంచి ఆగ్నేయాసియా, ఫసిఫిక్ బేసిన్ మీదుగా చాలా వరకు విస్తరించి ఉంటుంది. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు అధికంగా ఉంటాయి. ఈ కారణంగానే ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. మరోవైపు, సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలుతుంటాయ. వీటి ప్రభావం కారణంగా కూడా పలు దేశాల్లో భాపంకాలు అధికంగా నమోదవుతున్నాయి. వీటి తీవ్రత అధికంగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సమంత, చైతూ విడాకులపై నాగ్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ ఏమయ్యారో?

అనుబంధాలకు పెద్ద పీట వేసిన చిట్టి పొట్టి చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments