Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ సైనికులను చంపేశాం.. హఫీజ్ :: ఉత్తుత్తిదేనన్న భారత్

భారత సైనికుల్లో 30 మందిని హత్య చేశామంటూ ఉగ్ర సంస్థ జమాత్‌ ఉద్‌దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ ప్రకటించాడు. ఈ మేరకు ఒక ఆడియో టేప్‌ని విడుదల చేశాడు. దీనిపై భారత్ స్పందించింది. ఈ ఆడియోలో చేసిన ప్రకటన ఉత్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (14:55 IST)
భారత సైనికుల్లో 30 మందిని హత్య చేశామంటూ ఉగ్ర సంస్థ జమాత్‌ ఉద్‌దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ ప్రకటించాడు. ఈ మేరకు ఒక ఆడియో టేప్‌ని విడుదల చేశాడు. దీనిపై భారత్ స్పందించింది. ఈ ఆడియోలో చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనని పేర్కొంది. 
 
యూరీ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర తండాలపై సర్జికల్ స్ట్రైక్ జరిపి భారీ సంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టిన విషయంతెల్సిందే. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అంతేనా పాకిస్థాన్‌తో పాటు ఉగ్ర సంస్థలు రగిలిపోయాయి. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని వివిధ రకాల ప్లానులు వేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్‌లో భారత్‌ జరిపిన లక్షిత దాడులకు నిరసనగా తాము కూడా సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామన్నారు. ఈ దాడిలో 30 మంది భారత సైనికులు మృతిచెందారన్నారు. ఈ మేరకు ఒక ఆడియో టేప్‌ని విడుదల చేశాడు. అయితే అటువంటివి ఏం జరగలేదని, సైనికులు ఎవరూ మృతిచెందలేదని, ముగ్గురు కార్మికులు మాత్రమే మృతిచెందారని భారత సైన్యం స్పష్టం చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments