Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజులు తొడుక్కోలేదు.. ఒకసారి చేస్తే పదిసార్లు దాడి చేస్తాం.. భారత్‌కు పాక్ వార్నింగ్

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (17:13 IST)
భారత్‌కు పాకిస్థాన్ గట్టివార్నింగ్ ఇచ్చింది. ఒకసారి దాడి చేస్తే పది సార్లు తిరిగి దాడిచేస్తామంటూ హెచ్చరికలు చేసింది. లండన్‌లో మీడియాతో ఆర్మీ చీఫ్ జనరల్ ఒమర్ జావేద్ బజ్వాతో కలిసి పాకిస్థాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాట్లాడుతూ, తమ భూభాగంపై భారత్ ఒక్కసారి సర్జికల్ దాడి చేస్తే, మేము 10 సార్లు భారత్‌లోకి చొరబడి అటువంటి దాడులనే చేసి మా సత్తా చాటుతాం అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు.
 
ఏదైనా సాహసం చేసేముందు పాకిస్థాన్ సైనిక బలగాన్ని, తమ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు. చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను తమ సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి వున్నామన్నారు. 
 
పాకిస్థాన్‌లో మీడియాకు స్వాతంత్ర్యం లేదని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, తమ దేశంలో ప్రసార మాధ్యమాల ప్రసారాలకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కావడం లేదనీ, వాటికి పూర్తి స్వాతంత్ర్యం ఉందని సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments