Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సౌత్ ఇండియా స్టేట్స్ కంటే పాకిస్థాన్ బెట్టర్ : నవజ్యోత్ సింగ్ సిద్ధూ

సౌత్ ఇండియా స్టేట్స్ కంటే పాకిస్థాన్ బెట్టర్ : నవజ్యోత్ సింగ్ సిద్ధూ
, ఆదివారం, 14 అక్టోబరు 2018 (10:06 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేతగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ప్రధాని అయిన సందర్భంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. దీనిపై స్వదేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. వీటిని తన వాగ్ధాటితో సిద్ధూ కౌంటర్ వేశారు. 
 
ఈ నేపథ్యంలో సిద్ధూ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోమారు వివాదాస్పదమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడం కంటే పొరుగునున్న పాకిస్థాన్‌కు వెళ్లడమే మంచిదంటూ తూలనాడారు. 'పాకిస్థాన్‌ సంస్కృతికి, దక్షిణాది సంస్కృతికి చాలా తేడా ఉంది. తమిళంలో వణక్కం వంటి ఒకట్రెండు పదాలు తప్ప ఏమీ అర్థంకాదు. పాక్‌లో పంజాబీ, ఇంగ్లిషే మాట్లాడతారు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, పాక్‌ నిజంగానే కర్తాపూర్‌ సాహెబ్‌ గురుద్వారలోకి భారత సిక్కులకు ప్రవేశం కల్పిస్తే.. కౌగిలింతతోపాటు.. ఈసారి ముద్దు కూడా పెడతానంటూ ఆయన బాహాటంగా ప్రకటించారు. మంచి మాటల చమత్కారి అయిన నవజ్యోత్ సింగ్‌కు ఆ మాటలే ఇపుడు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైకి ఆంబోతును వదిలేశారు..