Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోండి : ఇమ్రాన్ పిలుపు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (09:05 IST)
భారత అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోమారు జోక్యం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోవాలంటూ ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పైగా, ఈ బిల్లుపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదేసమయంలో మోడీపై ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. 
 
ప్రధాని మోడీ ఓ పద్ధతి ప్రకారం హిందూ ఆధిపత్య ఎజెండాను అమలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు .అలాగే, అణుయుద్ధ బెదిరింపుల వల్ల పెద్ద ఎత్తున రక్తపాతం జరుగుతుందని, ఊహించనన్ని దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రపంచం అడ్డుకోవాలని సూచించారు. 
 
కాగా, ఇమ్రాన్ వ్యాఖ్యలకు భారత్ అంతే ఘటుగా సమాధానం ఇచ్చింది. తమ అంతర్గత విషయంలో తలదూర్చడం మానుకోవాలని హితవు పలికింది. తొలుత పాకిస్థాన్‌లోని మైనారిటీల సంగతి చూడాలని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రవీశ్‌కుమార్‌ కౌంటరిచ్చారు. ఇల్లు చక్కదిద్దుకుని వీధిలోకి రావాలంటూ సూటిగా చెప్పారు. మరోవైపు, పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments