Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది': పాక్ మంత్రి హెచ్చరిక

పాకిస్థాన్ సమాచార శాఖామంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను హెచ్చరించారు. 'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో అశాంతి కొనసాగినంత కాలం ఢిల్లీల

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (18:02 IST)
పాకిస్థాన్ సమాచార శాఖామంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను హెచ్చరించారు. 'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో అశాంతి కొనసాగినంత కాలం ఢిల్లీలో శాంతి ఉండబోదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. 
 
యురీ ఘటన తర్వాత పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై రషీద్ స్పందించారు. క్రూరత్వం మాత్రమే ఏకాకి అవుతుందన్న ఆయన కాశ్మీరీలను హింసిస్తున్న భారత్ మాత్రమే ఒంటరిగా మిగులుతుందని జోస్యం చెప్పారు. శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుందని దీనికి భారతే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
 
తమ దేశంలో పేదరికం, నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. యూరోప్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఏఎస్ఈఏఎన్)నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. భారత్‌తో చర్చల కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments