Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 భారత గణతంత్ర వేడుకలకు డొనాల్డ్ ట్రంప్ వస్తారా?

2019 భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిసింది. ఈ మేరకు భారత సర్కారు ట్రంప్‌ను గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. కానీ ఈ ఆహ్వానంపై వై

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (18:00 IST)
2019 భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిసింది. ఈ మేరకు భారత సర్కారు ట్రంప్‌ను గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. కానీ ఈ ఆహ్వానంపై వైట్ హౌస్ స్పందించలేదు. భారత ఆహ్వానం మేరకు ట్రంప్ కనుక వేడుకలకు హాజరైతే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తర్వాత వచ్చిన రెండో వ్యక్తి అవుతారు. 
 
2015 గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. మోదీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఒబామాను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అమెరికా- భారత్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ఇరాన్‌తో భారత్ వాణిజ్య ఒప్పందాలు, రష్యాతో ఆయుధ డీల్‌పై అమెరికా గుర్రుగా ఉంది.
 
ఈ నేపథ్యంలో ట్రంప్ రిపబ్లిక్ డే వేడుకలకు హాజరవుతారా అనేది అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఒకవేళ భారత ఆహ్వానం మేరకు ట్రంప్ విచ్చేస్తే తిరిగి రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, భారత రిపబ్లిక్ డే వేడుకలకు 2016లో అప్పటి ఫ్రెంచ్ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలండ్ హాజరు కాగా, 2017లో అబుదాబి ప్రిన్స్ హాజరైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments