Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఐవీఆర్
శుక్రవారం, 16 మే 2025 (15:26 IST)
చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత వుంది. ఇప్పుడు పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి పరిస్థితి కూడా అలాగే వున్నట్లు కనబడుతోంది. ఒకవైపు కీలకమైన స్థావరాలను కోల్పోవడమే కాకుండా అంతర్యుద్ధాన్ని సైతం చవిచూస్తున్న పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోవడంలేదు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ చేతిలో బిక్కచచ్చి ప్రపంచ దేశాల కాళ్లూగెడ్డాలు పట్టుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ యుద్ధం గురించి మాట్లాడారు.
 
భారత్ దాడిలో నాశనమైన రోడ్డు మార్గంలో దుమ్ములో పయనించి బుధవారం నాడు సియాల్ కోట్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బందితో మాట్లాడుతూ... భారతదేశం మళ్లీ యుద్ధం మాటెత్తితే ఇక వారికేమీ మిగలదనీ, సర్వస్వం కోల్పోతారంటూ చెవాకులు పేలారు. 1971 నాటి ఓటమికి ఇప్పుడు భారతదేశం పైన పగ తీర్చుకున్నామంటూ చెప్పుకున్నారు.
 
నరేంద్ర మోడీ యుద్ధానికి సై అంటే తాము కూడా సై అంటామని, ఐతే శాంతియుత చర్చలకు తమ దేశం సిద్ధంగా వుందని అన్నారు. సింధు జలాలు, కాశ్మీర్ అంశంపై చర్చించుకుని పరిష్కాలను ఇరువర్గాలు అన్వేషించాలని చెప్పుకొచ్చారు. సింధు జలాల విషయంలో భారత్ మొండి పట్టుదలకు పోతే తమకు ఏం చేయాలో బాగా తెలుసు అంటూ వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments