Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాదాపు మేం చచ్చామనుకున్నాం... అర్జున రణతుంగ

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (10:50 IST)
శ్రీలంకలో అధికార పోటీ ఏర్పడింది. ఆ దేశ ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమసింఘేను తొలగించి మహిందా రాజపక్సేను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న రణిల్ విక్రమ సింఘే ప్రభుత్వంలో పెట్రోలియం శాఖామంత్రిగా ఉన్న మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ హుటాహుటిన కొలంబోకు చేరుకుని తన కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, మహిందా రాజపక్సే అనుచరులు ఆయనపై దాడి చేసేందుకు యత్నించగా, ఆయన్ను లంక సైన్యం రక్షించింది. 
 
దీనిపై అరున రణతుంగ స్పందిస్తూ, ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలే కారణం. రాజపక్సే అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments