Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాదాపు మేం చచ్చామనుకున్నాం... అర్జున రణతుంగ

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (10:50 IST)
శ్రీలంకలో అధికార పోటీ ఏర్పడింది. ఆ దేశ ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమసింఘేను తొలగించి మహిందా రాజపక్సేను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న రణిల్ విక్రమ సింఘే ప్రభుత్వంలో పెట్రోలియం శాఖామంత్రిగా ఉన్న మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ హుటాహుటిన కొలంబోకు చేరుకుని తన కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, మహిందా రాజపక్సే అనుచరులు ఆయనపై దాడి చేసేందుకు యత్నించగా, ఆయన్ను లంక సైన్యం రక్షించింది. 
 
దీనిపై అరున రణతుంగ స్పందిస్తూ, ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలే కారణం. రాజపక్సే అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments