Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తమోడిన కాబూల్‌ - బాంబు పేలి 66 మంది మృతి

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (09:21 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ మసీదులో శక్తిమంతమైన బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి 66 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఖలీసా సాహిబ్ మసీదుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో మసీదు కిక్కిరిపోయింది. ఇదే అదునుగా భావించిన ఓ ఉగ్రవాది మానవబాంబుగా మారి తనను తాను పేల్చుకున్నాడు. 
 
అప్పటివరకు ఎంతో కోలాహలంగా ఉన్న మసీదు ఒక్కసారికాగ రక్తమోడింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. సున్నీ తెగకు చెందిన ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగింది. శనివారం ఉదయం వరకు 66 మంది చనిపోయారు. మరో 78 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. 
 
అయితే, ఈ మానవబాంబు పేలుడుకు ఇప్పటివరకు ఏ ఒక్క సంస్థా నైతిక బాధ్యత వహించలేదు. పేలుడుపై ఆప్ఘన్ భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మసీదు వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, ఈ పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూడా కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments