Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో హౌతీ తిరుగుబాటుదారుల దాడి.. మంటల్లో చిక్కుకున్న పౌర విమానం

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (08:24 IST)
సౌదీ అరేబియాలో హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. సౌదీ అరేబియాలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన ఈ దాడిలో ఓ పౌర విమానం మంటల్లో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే, ఈ విమానంలోని ప్రయాణికుల పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. 
 
ఈ ఘటనతో విమానాల ట్రాకింగ్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, గతంలో అబా విమానాశ్రయం లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు పలుమార్లు క్షిపణిదాడులకు దిగిన విషయం తెల్సిందే. అప్పట్లో ఆ దాడుల్లో పలువురు ప్రయాణికులు గాయపడినా, విమానానికి మంటలు అంటుకోవడం అన్నది మాత్రం ఇదే తొలిసారి.
 
2017లోనూ విమానాశ్రయంపై ఇలాంటి తరహా దాడే జరిగింది. సౌదీలోని చమురు కేంద్రాలపైనా తిరుగుబాటుదారులు దాడులు చేస్తూనే ఉన్నారు. 2015లోనే యెమెన్ రాజధానిని హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించినప్పటి నుంచి దాడులు పెరిగాయి. అయితే, వారి వెనక ఇరాన్ ఉందన్నది సౌదీ ఆరోపణ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments