Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం - భూకంప లేఖినిపై 6.0గా నమోదు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (10:41 IST)
పొరుగు దేశం నేపాల్‌ను భారీ భూకంపం ఒకటి కుదిపేసింది. ఆదివారం ఉదయం 8.13 గంటల ప్రాంతంలో ఆ దేశ రాజధాని ఖాట్మండుకు 147 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఈ వియాన్ని నేషనల్ ఎర్త్‌కేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం ఇది భూమికి 10 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం సంభవించలేదని నేపాల్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, నేపాల్ దేశంలో ఇటీవలి కాలంలో కాలంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇవి భారీ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. గత 2015 ఏప్రిల్ 25వ తేదీన ఖాట్మండు, పోఖరా నగరాల్లో 7.8 తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. ఇందులో దాదాపు 8,964 మంది నేపాలీయులు ప్రాణాలు కోల్పోగా, 22 వేల మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments