Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం - భూకంప లేఖినిపై 6.0గా నమోదు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (10:41 IST)
పొరుగు దేశం నేపాల్‌ను భారీ భూకంపం ఒకటి కుదిపేసింది. ఆదివారం ఉదయం 8.13 గంటల ప్రాంతంలో ఆ దేశ రాజధాని ఖాట్మండుకు 147 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఈ వియాన్ని నేషనల్ ఎర్త్‌కేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం ఇది భూమికి 10 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం సంభవించలేదని నేపాల్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, నేపాల్ దేశంలో ఇటీవలి కాలంలో కాలంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇవి భారీ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. గత 2015 ఏప్రిల్ 25వ తేదీన ఖాట్మండు, పోఖరా నగరాల్లో 7.8 తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. ఇందులో దాదాపు 8,964 మంది నేపాలీయులు ప్రాణాలు కోల్పోగా, 22 వేల మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments