Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్లుగా టెంటులో నిద్రిస్తూ రూ.7 కోట్ల విరాళాలు సేకరించిన బాలుడు

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (10:20 IST)
బ్రిటన్‌కు చెందిన మ్యాక్స్‌ వూజీ అనే పదేళ్ళ బాలుడు ఓ ఆసుపత్రి స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చడం కోసం సరికొత్త పంథా ఎంచుకున్నాడు. రోజూ రాత్రి పూట ఇంట్లో కాకుండా బయట టెంట్‌ వేసుకొని నిద్రపోయాడు. అలా మూడేళ్లపాటు నిర్విరామంగా దీన్ని కొనసాగించాడు. తద్వారా దాదాపు రూ.ఏడు కోట్ల నిధులు విరాళంగా వచ్చాయి. 
 
మ్యాక్స్‌ ఇంటి పక్కన గతంలో రిక్‌ అబాట్‌ అనే వ్యక్తి నివసించేవారు. ఆయన 74ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో చనిపోయారు. అంతకుముందే రిక్‌ తన దగ్గరున్న టెంట్‌ను మ్యాక్స్‌కు ఇచ్చారు. దీంతో ఏదైనా సాహస కార్యం చేయమని ఆయన చెప్పిన మాటలు మ్యాక్స్‌లో స్ఫూర్తి నింపాయి. దాంతో 2020 మార్చిలో ఆరుబయట టెంట్‌లో నిద్రించాలని నిర్ణయం తీసుకున్నట్లు మ్యాక్స్‌ మీడియాకు తెలిపాడు. 
 
ఇలా చేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి మ్యాక్స్‌ను ప్రోత్సహిస్తూ పలువురు తనకు విరాళాలు పంపించారు. ఆ మొత్తం ఇప్పుడు దాదాపు రూ.7 కోట్లకు చేరింది. మ్యాక్స్‌ తన మూడేళ్ల టెంట్‌ నిద్రకు ముగింపుగా ఏప్రిల్‌ 1న ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశాడు. ఆ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థకు పంపిస్తానని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments