Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన కుమారుడిని ఓపెన్ ఏఐ హత్య చేసింది : తల్లి పూర్ణమ రావు

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (09:38 IST)
చాటీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ‌పై ప్రజావేగు (విజిల్ బ్లోయర్) తల్లి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడిని ఓపెన్ఏఐ సంస్థ హత్య చేసిందంటూ ఆరోపించారు. ఈ సంస్థలో నాలుగేళ్లుగా విజిల్ బ్లోయర్, భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ (26) ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఓపెన్ఏఐ సంస్థ తన కుమారుడిని హత్యచేసిందని పేర్కొన్నారు. ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా తన కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయని, వారు ఏమి చేస్తున్నారనే విషయాలు అతడికి తెలుసన్నారు. తమ రహస్యాలు ఎవరికి తెలియకుండా ఉండాలనే కారణంతోనే తన కొడుకుని పొట్టపెట్టుకున్నట్లు ఆరోపించారు.
 
అమెరికాలో టక్కర్ కార్లసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కుమారుడి మరణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి పలు విషయాలను బహిర్గతం చేశారు. 'నా కుమారుడు చనిపోవడానికి ఒకరోజు ముందు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. ఒక వేళ తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ వేడుకలు జరుపుకొనే వాడా? తనకు ఆ ఉద్దేశం ఉంటే తన తండ్రి పంపించిన పుట్టిన రోజు బహుమతులను బాలాజీ చనిపోయే రోజు ఎలా అందుకుంటాడు' అని అనుమానాలు వ్యక్తం చేశారు.
 
అలాగే, 'ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా నా కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయి. అందుకే దాడి చేసి చంపారు. తను చనిపోయాక కొన్ని డాక్యుమెంట్లు కనిపించడం లేదు. చాటీజీపీటీ రూపకర్తలు విచారణపై ప్రభావం చూపారు. ఈ విషయం గురించి తెలిసిన సాక్షులను తమ పరిధిలో ఉంచుకున్నారు. నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. న్యాయవాదులు సైతం దీన్ని ఆత్మహత్యగా పేర్కొంటున్నారు. కేవలం 14 నిమిషాల వ్యవధిలోపే తన కుమారుడి మృతిని ఆత్మహత్యగా అధికారులు తేల్చారు' అని పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 
కాగా, శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్టుమెంటులో గతేడాది నవంబరు 26వ తేదీ బాలాజీ మృతి చెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసుల దీన్ని ఆత్మహత్యగా పేర్కొన్నారు. దీంతో బాలాజీ మృతిపై అతడి అమ్మ పూర్ణిమరావు న్యాయపోరాటానికి దిగారు. తన కుమారుడు మృతిపై అనుమానాలు ఉన్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments