Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీ భూకంప మృతులు రూ.2 వేలు : 10 వేల మందికి గాయాలు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:39 IST)
హైతీ భూకంప మృతుల సంఖ్య రెండు వేలకు చేరుకున్నాయి. ఈ భూకంపంలో గాయపడిన వారి సంఖ్య పది వేలు దాటిపోయాయి. గత వారాంతం సంభవించిన ఈ భారీ భూకంప విలయం నుంచి కోలుకోకముందే పెను తుపాను విరుచుకుపడింది. 
 
దీంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇదిలావుంటే, ఈ ఘోర భూకంప విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారం నాటికి దాదాపు 2 వేలకు చేరుకుంది. మరో 10వేల మంది గాయాలపాలయ్యారు. 
 
గత శనివారం 7.2 తీవ్రతతో భారీ భూకంపం హైతీ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 1,941 మంది మరణించినట్లు ఆ దేశ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ మంగళవారం రాత్రి వెల్లడించింది. ఇక 9,900 మంది గాయపడ్డారని, వీరిలో చాలా మందికి ఇంకా వైద్య సాయం అందకపోవడంతో ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొంది. 
 
ఈ పెను విధ్వంసానికి ఇళ్లు, భవనాలు పూర్తి నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, దెబ్బ మీద దెబ్బలా.. ఇప్పుడు హైతీపై గ్రేస్‌ తుపాను కూడా విరుచుకుపడింది. నిన్న చాలా ప్రాంతాలో భారీవర్షం కురిసింది. దీంతో సహాయకచర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments