Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీ భూకంప మృతులు రూ.2 వేలు : 10 వేల మందికి గాయాలు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:39 IST)
హైతీ భూకంప మృతుల సంఖ్య రెండు వేలకు చేరుకున్నాయి. ఈ భూకంపంలో గాయపడిన వారి సంఖ్య పది వేలు దాటిపోయాయి. గత వారాంతం సంభవించిన ఈ భారీ భూకంప విలయం నుంచి కోలుకోకముందే పెను తుపాను విరుచుకుపడింది. 
 
దీంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇదిలావుంటే, ఈ ఘోర భూకంప విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారం నాటికి దాదాపు 2 వేలకు చేరుకుంది. మరో 10వేల మంది గాయాలపాలయ్యారు. 
 
గత శనివారం 7.2 తీవ్రతతో భారీ భూకంపం హైతీ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 1,941 మంది మరణించినట్లు ఆ దేశ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ మంగళవారం రాత్రి వెల్లడించింది. ఇక 9,900 మంది గాయపడ్డారని, వీరిలో చాలా మందికి ఇంకా వైద్య సాయం అందకపోవడంతో ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొంది. 
 
ఈ పెను విధ్వంసానికి ఇళ్లు, భవనాలు పూర్తి నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, దెబ్బ మీద దెబ్బలా.. ఇప్పుడు హైతీపై గ్రేస్‌ తుపాను కూడా విరుచుకుపడింది. నిన్న చాలా ప్రాంతాలో భారీవర్షం కురిసింది. దీంతో సహాయకచర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments