Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీ భూకంప మృతులు రూ.2 వేలు : 10 వేల మందికి గాయాలు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:39 IST)
హైతీ భూకంప మృతుల సంఖ్య రెండు వేలకు చేరుకున్నాయి. ఈ భూకంపంలో గాయపడిన వారి సంఖ్య పది వేలు దాటిపోయాయి. గత వారాంతం సంభవించిన ఈ భారీ భూకంప విలయం నుంచి కోలుకోకముందే పెను తుపాను విరుచుకుపడింది. 
 
దీంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇదిలావుంటే, ఈ ఘోర భూకంప విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారం నాటికి దాదాపు 2 వేలకు చేరుకుంది. మరో 10వేల మంది గాయాలపాలయ్యారు. 
 
గత శనివారం 7.2 తీవ్రతతో భారీ భూకంపం హైతీ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 1,941 మంది మరణించినట్లు ఆ దేశ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ మంగళవారం రాత్రి వెల్లడించింది. ఇక 9,900 మంది గాయపడ్డారని, వీరిలో చాలా మందికి ఇంకా వైద్య సాయం అందకపోవడంతో ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొంది. 
 
ఈ పెను విధ్వంసానికి ఇళ్లు, భవనాలు పూర్తి నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, దెబ్బ మీద దెబ్బలా.. ఇప్పుడు హైతీపై గ్రేస్‌ తుపాను కూడా విరుచుకుపడింది. నిన్న చాలా ప్రాంతాలో భారీవర్షం కురిసింది. దీంతో సహాయకచర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్

బాల్యం నుంచి బాధ్యతకు ఎదిగిన కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ ఆవిషరించిన నితిన్

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments