Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్మనీ చాన్స్‌లర్‌గా ఏంజిలా మెర్కెల్‌‌కే ఛాన్సెస్...

ఐరోపాలోని జర్మనీ పార్లమెంటు దిగువ సభ బుందేస్టాగ్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ తిరిగి అధికారం చేపట్టారు. మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రెటిక్ యూనియన్(సీడీయూ)కు 33.2శా

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (10:53 IST)
ఐరోపాలోని జర్మనీ పార్లమెంటు దిగువ సభ బుందేస్టాగ్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ తిరిగి అధికారం చేపట్టారు. మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రెటిక్ యూనియన్(సీడీయూ)కు 33.2 శాతం ఓట్లు లభించాయి. 1949 సాధారణ ఎన్నికల తరువాత ఇంత తక్కువ శాతం ఓట్లు రావడం ఇదే తొలిసారి. 
 
ఇమ్మిగ్రేషన్‌ను వ్యతిరేకించే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి 13.1 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెర్కెల్.. ప్రభుత్వం ఏర్పాటుకు మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రతిపక్ష పార్టీ సోషల్ డెమొక్రటిక్‌కు 20.8 శాతం ఓట్లు వచ్చాయి. దీనిని గమనిస్తే జర్మనీలోని సగం జనాభా ఓట్లను రెండు పార్టీలే దక్కించుకున్నాయని తెలుస్తోంది.
 
కాగా, ఆదివారం నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మెర్కెల్‌ పార్టీకి 32.5–33.5 శాతం, ఎస్‌పీడీకి 20–21 శాతం, ఏఎఫ్‌డీకి 13–13.5 శాతం ఓట్లు వచ్చాయి. 2005లో తొలిసారిగా ఏంజిలా చాన్స్‌లర్‌ పదవి చేపట్టారు. ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్‌ డెమొక్రాటిక్‌ యూనియన్ ‌(సీడీయూ) – క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో ఆధిక్యం సాధించడంతో పన్నెండేళ్లుగా ఏంజిలానే చాన్స్‌లర్‌ పదవిలో కొనసాగుతున్నారు. ఈసారి గెలిస్తే 16 ఏళ్లు అధికారంలో ఉండి, హెల్ముల్‌ కోల్‌ రికార్డును మెర్కెల్‌ సమం చేస్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments