Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా గ్యాస్ పైప్ లేన్‌లో భారీ పేలుడు - 12 మంది మృతి

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (16:32 IST)
చైనాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. హ్యూబెయ్ ప్రావిన్స్‌లోని షియాన్ సిటీలోని ఓ నివాస సముదాయం వద్ద గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించిందని స్థానిక సీసీటీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 
 
ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. 144 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో మరో 37 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. 
 
2013లో ఈశాన్య ప్రాంతంలోని ఖింగ్డావోలో జరిగిన పేలుడులాగే ఈ పేలుడూ సంభవించి ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు భూగర్భంలోని పైప్ లైన్‌లు లీకై పెద్ద పేలుడు సంభవించడంతో 55 మంది చనిపోయారు.
 
కాగా, 2015లో ఓ రసాయన గోదాములో జరిగిన ప్రమాదంలో 173 మంది మరణించారు. అందులో ఎక్కువగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులే ఉన్నారు. గోదామును అక్రమంగా నిర్మించడం, అనుమతుల్లేకుండా రసాయనాలను దాచడం వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments