Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో డోసు టీకా వేసుకున్న వ్యక్తి శరీరంలో అయస్కాంత శక్తులు!

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (15:35 IST)
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వీలుగా కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవాలని పదేపదే కోరుతున్నారు. అయితే, కరోనా రెండో డోసు వేసుకున్న వారి శరీరంలో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయి.
 
ఇటీవల మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన అరవింద్ సోనార్ అనే వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అయస్కాంత శక్తులు వచ్చాయన్న ఘటన సంచలనం సృష్టించింది. 
 
ఇప్పుడా ఘటన మరువక ముందే ఉల్హాస్ నగర్‌కు చెందిన మరో వ్యక్తి కరోనా టీకా రెండో డోసు తీసుకున్న అనంతరం అయస్కాంత శక్తులు వచ్చినట్టు చెబుతుండడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.
 
ఆ వ్యక్తి పేరు శాంతారాం చౌదరి. తనకు అయస్కాంత శక్తులు వచ్చినట్టు నిరూపించడానికి ఓ వీడియో కూడా విడుదల చేశాడు. అందులో ప్లేట్లు, స్పూనులు, నాణేలు అతడి శరీరానికి అయస్కాంతంలా అతుక్కుపోవడం చూడొచ్చు.
 
దీనిపై శాంతారాం చౌదరి మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల నాసిక్ వ్యక్తి కరోనా టీకా తీసుకున్న తర్వాత అయస్కాంత శక్తులు పొందిన వైనం మీడియా ద్వారా తెలుసుకున్నానని వెల్లడించాడు. 
 
తాను కూడా రెండో డోసు టీకా వేయించుకున్నాక, తనలోనూ అయస్కాంత శక్తులు వచ్చాయేమోనని పరిశీలించానని తెలిపాడు. ప్లేట్లు, స్పూనులు అతుక్కోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వివరించాడు. దాంతో, తనలోనూ అయస్కాంత శక్తులు వచ్చాయని నిర్ధారించుకున్నట్టు శాంతారాం చౌదరి వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments