Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా నుంచి చమురు దిగుమతుల నిలిపివేతకు జీ-7 దేశాల నిర్ణయం

Webdunia
సోమవారం, 9 మే 2022 (15:15 IST)
ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండయాత్ర చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనేక ప్రపంచ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లతో పాటు యూరోపియన్ దేశాలు ఈ తరహా ఆంక్షలు విధించి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీ-7 దేశాలన్నీ కలిసి మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని తీర్మానించాయి. 
 
ఈ జి-7 దేశాల్లో ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్, ఇటలీ, బ్రిటన్, అమెరికా దేశాలు ఉన్నాయి. ఈ రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఇంధనాన్ని నిలిపివేస్తే, తమకు ఎదురయ్యే సమస్యలపై ఆ దేశాలు స్పష్టమైన ప్రకటనను విడుదల చేయలేదు. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 
 
అంతేకాకుండా మాస్కో ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా జీ-7 దేశాల ఐక్యతను చాటి చెప్పనుంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఇంధన మోతాదును దశల వారీగా తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నాం. అదేసమయంలో తమ దేశ అవసరాలకు సరిపడిన ఇంధన నిల్వలపై ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం అని జీ-7 దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments