Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలే సాయుధులు రెచ్చిపోయారు.. 37మంది బలి

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (11:20 IST)
పశ్చిమ నైజర్‌లోని టిల్లాబేరి ప్రాంతంలో ఉన్న బానిబంగోలో పట్టపగలే సాయుధులు రెచ్చిపోయారు. మరాణాయుధాలతో ఓ గ్రామంలోకి చొరబడి కాల్పుల మోత మోగించారు. చిన్నపిల్లలు, మహిళలని కూడా చూడకుండా.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దుండగుల బీభత్సానికి 37 మంది బలయ్యారు. మృతుల్లో 17 ఏళ్ల లోపు చిన్నారులు 13 మంది ఉన్నారు. నలుగురు మహిళలు కూడా మరణించారు.  
 
సోమవారం మధ్యాహ్నం తుపాకులతో కొందరు సాయుధులు గ్రామంలోకి చొరబడ్డారు. వస్తూ వస్తూనే కనిపించిన వారిందరిపైనా కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే చాలా మంది నేలకొరిగారు. ఆస్పత్రికి తరలించే లోపే మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ఘటనపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అభం శుభం తెలియని అమాయక పిల్లలను చంపడం దారుణమని పేర్కొంది. మృతుల కుటుంబాకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి ముష్కర మూకల అంతానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments