Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజింగ్‌లో కరోనా కలకలం.. ఫుడ్ డెలివరీ మ్యాన్ ద్వారా కోవిడ్

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (10:57 IST)
చైనా దేశంలోని బీజింగ్ నగరంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ డెలివరీ మ్యాన్‌ ద్వారా కరోనా వైరస్ వ్యాపించింది.  ఫుడ్ డెలివరీ మ్యాన్‌కు కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. 
 
చైనా రాజధాని నగరమైన బీజింగ్‌లో 47 ఏళ్ల ఫుడ్ డెలివరీ మ్యాన్ జూన్ 1నుంచి 17వతేదీ వరకు డాక్సింగ్, ఫంగ్ షాన్, డాంగ్ చెంగ్, ఫెంగటయ్ ప్రాంతాల్లో రోజుకు 50 మందికి చొప్పున ఆహారాన్ని డెలివరీ చేశారు. దీంతో ఫుడ్ డెలివరీ మ్యాన్ ను క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఫుడ్ డెలివరీ ఎవరెవరికి చేశాడనే విషయంపై వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు ఆరా తీస్తున్నారు. చైనా దేశంలో కొత్తగా 29 మందికి కరోనా వైరస్ సోకిందని చైనా ఆరోగ్యసంస్థ అధికారులు ప్రకటించారు. మొత్తంమీద 249 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. 
 
ఫుడ్ డెలివరీ మ్యాన్ ద్వారా కరోనా ప్రబలిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో ఏడు కేసులు అసింప్టెమాటిక్ అని అధికారులు చెప్పారు. మళ్లీ కరోనా వైరస్ ప్రబలుతుండటంతో బీజింగ్ నగరంలో మళ్లీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments