Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచంలో విజృంభిస్తున్న మహమ్మారి... పెరిగిన పసిడి ధరలు

ప్రపంచంలో విజృంభిస్తున్న మహమ్మారి... పెరిగిన పసిడి ధరలు
, మంగళవారం, 23 జూన్ 2020 (22:34 IST)
ప్రపంచ ప్రభుత్వం యొక్క ప్రధాన ఆందోళనలైన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి రావడం, అదే సమయంలో, పౌరుల భద్రతకు హామీ ఇవ్వడం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలకు భరోసా ఇవ్వడంపై దృష్టి సారించాయి.
 
బంగారం
యుఎస్ మరియు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతూ ఉండటంతో సోమవారం రోజున, స్పాట్ బంగారం ధరలు కొద్దిగా 0.7 పెరిగి, ఔన్సుకు 1754.5 డాలర్లకు చేరుకున్నాయి. మహమ్మారి చుట్టూ ఉన్న అనిశ్చితి, స్వర్గధామమైన సంపద అయిన బంగారం కోసం విజ్ఞప్తిని లేవనెత్తింది.
 
యు.ఎస్. ఫెడరల్ రిజర్వ్ యొక్క నివేదికలు తగిన చర్యలు అమలు చేయకపోతే నిరుద్యోగ క్లెయిమ్స్ పెరుగుతూనే ఉంటాయని నివేదించిచాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ప్రారంభించిన ఆచరణాత్మక, కార్యసాధక ఉద్దీపన మరియు పునరుజ్జీవన చర్యలు పసుపు లోహ ధరలకు మద్దతు ఇచ్చాయి.
 
వెండి
సోమవారం రోజున, స్పాట్ వెండి ధరలు 1.25 శాతం పెరిగి, ఔన్సుకు 17.8 డాలర్లకు చేరుకున్నాయి. ఎంసిఎక్స్ ధరలు 0.28 శాతం తగ్గి కిలోకు రూ. 48500 వద్ద ముగిశాయి.
 
ముడి చమురు
సోమవారం రోజున, డబ్ల్యుటిఐ ముడిచమురు ధరలు 1.79 శాతం పెరిగి బ్యారెల్ కు, 40.5 డాలర్లకు చేరుకున్నాయి, ఎందుకంటే ఒపెక్ దూకుడు ఉత్పత్తి కోతలను అమలు చేయాలనే నిర్ణయాన్ని కొనసాగించింది. అయినా, ముడి చమురు యొక్క లాభాలు నిలిచిపోయాయి, ఎందుకంటే చైనా వంటి చాలా ప్రదేశాలలో, కరోనావైరస్ యొక్క కొత్త కేసులు సంభవిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అస్పష్టమైన డిమాండ్ ఉన్న ప్రపంచంలో, వాయు మరియు రహదారి ట్రాఫిక్‌పై ఆంక్షలు చమురు ధరల పెరుగుదలను మరింత పరిమితం చేశాయి.
 
మూల లోహాలు
సోమవారం రోజున, లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (ఎల్ఎమ్ఇ) పై బేస్ మెటల్ ధరలు సానుకూలంగా ముగిశాయి, చైనా నుండి వచ్చిన నివేదికలు సానుకూల వాణిజ్య డేటాను మరియు అగ్ర లోహ వినియోగదారుల నుండి పెరుగుతున్న డిమాండ్ ను సూచించాయి.
 
మెరుగైన చైనా డిమాండ్ పెంచిన ముఖ్యమైన సంకేతాలలో ఒకటి ఎస్.హె.ఎఫ్.ఇ యొక్క ఇన్వెంటరీ స్థాయిలు తగ్గడం. ఎస్.హెచ్.ఎఫ్.ఇ పై అల్యూమినియం మరియు జింక్ ఇన్వెంటరీలు మార్చి 2020 లో నమోదైన సంవత్సరపు గరిష్ట స్థాయి నుండి 50 శాతం మరియు 40 శాతానికి పైగా పడిపోయాయి. క్షీణిస్తున్న జాబితా పారిశ్రామిక లోహ ధరలలో స్థిరమైన పెరుగుదలతో పాటు, పెరిగిన డిమాండ్ వైపు మొగ్గు చూపబడింది. అయినా, యుఎస్ డాలర్ యొక్క పెరుగుతున్న ధర, కరోనావైరస్ యొక్క రెండవ తరంగం చుట్టూ ఉన్న అనిశ్చితితో పాటు, మార్కెట్ మనోభావాలను బట్టి మూల లోహాల పెరుగుదలను పరిమితం చేసింది.
 
రాగి
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు ఉద్దీపన ప్రణాళికలను ప్రకటించడంతో సోమవారం, ఎల్‌ఎంఇ కాపర్ 0.53 శాతం అధికంగా ముగిసింది. ఇంకా, షాంఘై ఎక్స్ఛేంజ్‌లోని రాగి జాబితాలు 70 శాతానికి పైగా పడిపోయాయి, ఇది మార్చి 2020 లో గరిష్ట స్థాయి కంటే చాలా తక్కువగా ఉంది. 2020 లో మొదటి ఐదు నెలల్లో (మునుపటి సంవత్సరంతో పోల్చినప్పుడు) ఇన్వెంటరీ స్థాయిలు పడిపోవడంతో పాటు, చైనాలో దుక్క రాగి దిగుమతులు 12.4% పెరిగి, చైనా నుండి డిమాండ్ బలంగా ఉందని సూచించాయి. అయినప్పటికీ, యు.ఎస్ మరియు చైనా నడుమ ఉద్రిక్తతలు, మరియు వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో చైనా  విఫలమైనందుకు, అమెరికా, చైనాను వేలెత్తి చూపించడంతో, వాణిజ్య వృద్ధిని నెమ్మదింపజేసింది.
 
మహమ్మారిని పారద్రోలడానికి సంభావ్య టీకా మరియు నివారణను ఎంత త్వరగా అభివృద్ధి చేయవచ్చో చూడాలి. ఇంతలో, మాంద్యం లాంటి పరిస్థితులను మరియు ప్రపంచం ఎదుర్కొంటున్న పరిణామాలను పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు చేతులు కలపాలి.
 
- ప్రథమేష్ మాల్యా, ఎవిపి - రీసెర్చ్ నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిటిడిని వణికిస్తున్న కరోనా, ఎన్ని కేసులో తెలిస్తే షాకే?