Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో పేలిపోయిన మినీ సబ్‌మెరైన్... ఐదుగురు బిలియనీర్స్ మృతి

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (09:06 IST)
అట్లాంటింక్ మహాసముద్రంలో 111 యేళ్ల క్రితం మునిగిపోయి 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు వెళ్ళి గల్లంతైన మినీ జలాంతర్గామి (మినీ సబ్ మెరైన్) కథ ముగిసింది. టైటానికి కోసం చేసిన అన్వేషణ ఫలించలేదు. దీంతో ఆ సబ్ మెరైన్‌లోని ఐదుగురు బిలియనీర్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర పీడనం కారణంగా అది సముద్ర గర్భంలో పేలిపోయిందని అమెరికన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్టు రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు. 
 
టైటాన్‌లోని టైటానికి శకలాలు చూసేందుకు వెళ్లిన ఐదుగురు చనిపోయివుండొచ్చని అంతకుముందు ఈ యాత్రను చేపట్టిన ఓషన్‌గేట్ తెలిపింది. ఆ ఐదుగురు నిజమైన అన్వేషకులని, ప్రపంచ మహాసముద్రాల అన్వేషణ, రక్షణలో వీరు ఎంతో అభిరుచి కలిగి ఉన్నారని పేర్కొంది. ఈ విషాద సమయంలో తమ ఆలోచనలు వారి కుటుంబాలతోనే ఉన్నాయని, ఈ ఘటనకు చింతిస్తున్నట్టు వెల్లడించింది. 
 
కాగా, ఈ మినీ సబ్‌మెరైన్‌లో చనిపోయిన వారిలో పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48), ఈయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈలో ఉండే బ్రిటీష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నావికాదళ అధికారి పాల్ హెన్రీ, యాత్ర నిర్వాహకడు, ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్‌లు ఉన్నారు.
 
ఈ మినీ జలాంతర్గామి సముద్రంలోకి వెళ్లిన కొద్ది సమయానికే మదర్ షిప్‌తో సంబంధాలు తెగిపోయి, సముద్రంలో గల్లంతైంది. అప్పటి నుంచి దానికోసం అన్వేషణ సాగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్ర పీడనం కారణంగా సముద్ర గర్భంలో అది పేలిపోవడంతో అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments