Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు పాకిస్తాన్‌ వ్యక్తుల అరెస్టు

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (17:24 IST)
మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులను గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌ వ్యక్తుల నుంచి 35 కేజీల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ. 175 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. తీరప్రాంతం గుండా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నారని యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌(ఏటీఎస్‌), గుజరాత్‌ పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో తీర ప్రాంతంలో పోలీసులు గస్తీ నిర్వహించారు.

పాకిస్తాన్‌ నుంచి చేపల బోటులో వచ్చిన ఐదుగురి వద్ద హిరాయిన్‌ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అన్నీస్‌(30), ఇస్మాయిల్‌ మహ్మమద్‌(50), ఆష్రఫ్‌ ఉస్మాన్‌(42), కరీం అబ్దుల్లా(37), అబుబాకర్‌ ఆష్రఫ్‌(55)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments