ఐదుగురు పాకిస్తాన్‌ వ్యక్తుల అరెస్టు

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (17:24 IST)
మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులను గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌ వ్యక్తుల నుంచి 35 కేజీల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ. 175 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. తీరప్రాంతం గుండా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నారని యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌(ఏటీఎస్‌), గుజరాత్‌ పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో తీర ప్రాంతంలో పోలీసులు గస్తీ నిర్వహించారు.

పాకిస్తాన్‌ నుంచి చేపల బోటులో వచ్చిన ఐదుగురి వద్ద హిరాయిన్‌ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అన్నీస్‌(30), ఇస్మాయిల్‌ మహ్మమద్‌(50), ఆష్రఫ్‌ ఉస్మాన్‌(42), కరీం అబ్దుల్లా(37), అబుబాకర్‌ ఆష్రఫ్‌(55)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments