ఈ-బైకు పేలి ఐదుగురి మృత్యువాత.. 38 మందికి గాయాలు ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 మే 2019 (15:55 IST)
ఈ-బైకు పేలి ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన దక్షిణ చైనాలో జరిగింది. చార్జింగ్ పెట్టిన బైకు ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు వ్యాపించి పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీహదహనం కాగా, మరో 38 మంది వరకు గాయాపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే, దక్షిణ చైనాలోని గ్యాంగ్జిజువాంగ్ గులియన్‌లో ఓ భవన సముదాయంలో ఓ వ్యక్తి నివశిస్తున్నాడు. ఈయన తన ఇంట్లో ఈ-బైకుకు చార్జింగ్ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాతా షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద శబ్దంతో పేలి, మంటలు చెలరేగాయి. 
 
ఈ మంటలు ఎగిసి చుట్టుపక్కల వ్యాపించడంతో ఐదు గృహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ గృహాల్లో చిక్కుకున్న వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 38 మంది గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపుచేశాయి. అనంతరం గాయపడిన వారిని అధికారులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా, చనిపోయినవారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments