Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-బైకు పేలి ఐదుగురి మృత్యువాత.. 38 మందికి గాయాలు ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 మే 2019 (15:55 IST)
ఈ-బైకు పేలి ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన దక్షిణ చైనాలో జరిగింది. చార్జింగ్ పెట్టిన బైకు ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు వ్యాపించి పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీహదహనం కాగా, మరో 38 మంది వరకు గాయాపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే, దక్షిణ చైనాలోని గ్యాంగ్జిజువాంగ్ గులియన్‌లో ఓ భవన సముదాయంలో ఓ వ్యక్తి నివశిస్తున్నాడు. ఈయన తన ఇంట్లో ఈ-బైకుకు చార్జింగ్ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాతా షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద శబ్దంతో పేలి, మంటలు చెలరేగాయి. 
 
ఈ మంటలు ఎగిసి చుట్టుపక్కల వ్యాపించడంతో ఐదు గృహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ గృహాల్లో చిక్కుకున్న వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 38 మంది గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపుచేశాయి. అనంతరం గాయపడిన వారిని అధికారులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా, చనిపోయినవారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments