Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్లకు భారతీయుల కుచ్చుటోపీ : రూ.500 కోట్ల మోసం

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (12:48 IST)
అమెరికన్లను మోసం చేసి రూ.500 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో ముగ్గురు మహా మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు భారతీయులే ఉండటం శోచనీయం. 
 
మోహిత్ దేవేంద్రభాయ్ శర్మ, కునాల్ జగదీశ్‌భాయ్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు గుజరాత్ కేంద్రంగా ఓ కాల్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. కెనడాకు చెందిన జూలియట్ బెల్లె కార్టర్ అనే మరో వ్యక్తిని కూడా తమతో చేర్చుకున్నారు. కార్టర్ సహాయంతో అమెరికన్ల వ్యక్తిగత వివరాలను సేకరించడం ప్రారంభించారు. ఎంచుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి అమెరికా రెవెన్యూ విభాగానికి మీరు పన్నులు సరిగ్గా కట్టలేదని ఇలా చేస్తే శిక్షపడుతుందని బెదిరించసాగారు. 
 
బాధితులు భయపడి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు దాదాపు 15 వేల మందిని వీరు ముగ్గురూ కలిసి మోసం చేసారని సమాచారం. ఈ కుంభకోణం విలువ రూ.500 కోట్లకు పైగా ఉందని పోలీసులు తెలిపారు. మోసాన్ని గుర్తించిన అమెరికా అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. కార్టర్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అదేవిధంగా మోహిత్ దేవేంద్రభాయ్ శర్మ, కునాల్ జగదీశ్‌భాయ్ శర్మ అనే ఇద్దరు భారతీయులను కూడా అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments