సముద్రంలో ఇథియోపియా ఎయిర్‌లైన్ : 157 మంది ప్రయాణికుల గల్లంతు

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (15:39 IST)
ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇథియోపియా ప్రధాని కార్యాలయం అధికారికంగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ విమాన ప్రమాదంలో 157 మంది ప్రయాణికులంతా చనిపోయివుంటారని భావిస్తున్నారు. విమాన ప్రమాదంలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ కార్యాల‌యం ట్విటర్ వేదికగా వెల్ల‌డించింది. ప్రమాద సమయంలో విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం.. అడిస్ అబాబాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 8:38 గంటలకు విమానం గాల్లోకి లేచిందని.. ఆ తర్వాత కొంతసేపటికే 8:44 గంటలకే ప్రమాదానికి గురైందన్నారు. ప్రమాదానికి గల కారణాలు, విమానం ఎక్కడ కుప్పకూలిందన్న వివరాలు ఇంకా తెలియలేదు. ప్రాణ‌న‌ష్టం భారీగా ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

Divi: బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో కర్మస్థలం పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments