Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో ఇథియోపియా ఎయిర్‌లైన్ : 157 మంది ప్రయాణికుల గల్లంతు

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (15:39 IST)
ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇథియోపియా ప్రధాని కార్యాలయం అధికారికంగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ విమాన ప్రమాదంలో 157 మంది ప్రయాణికులంతా చనిపోయివుంటారని భావిస్తున్నారు. విమాన ప్రమాదంలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ కార్యాల‌యం ట్విటర్ వేదికగా వెల్ల‌డించింది. ప్రమాద సమయంలో విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం.. అడిస్ అబాబాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 8:38 గంటలకు విమానం గాల్లోకి లేచిందని.. ఆ తర్వాత కొంతసేపటికే 8:44 గంటలకే ప్రమాదానికి గురైందన్నారు. ప్రమాదానికి గల కారణాలు, విమానం ఎక్కడ కుప్పకూలిందన్న వివరాలు ఇంకా తెలియలేదు. ప్రాణ‌న‌ష్టం భారీగా ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments