ఉత్తర కొరియాలో ఎమర్జెన్సీ.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 27 జులై 2020 (09:43 IST)
ఉత్తర కొరియాలో తొలి కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో సరిహద్దు పట్టణమైన కెేసాంగ్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తొలి కేసు రాగానే కేసాంగ్‌ సిటీని పూర్తిగా లాక్‌డౌన్‌ చేశారు.

ఇతర జిల్లాలను, ప్రాంతాలను అప్రమత్తం చేశారు. కేసాంగ్‌లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితి దృష్ట్యా మహమ్మారి వ్యతిరేక ఎమర్జెన్సీ నుంచి గరిష్ట ఎమర్జెన్సీకి మారాలని, ఉన్నత స్థాయి హెచ్చరికను జారీ చేయాలని నిర్ణయించారు.

ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ (కెసిఎన్‌ఎ) తెలిపిన వివరాలను బట్టి కరోనా వైరస్‌ సోకినట్టుగా అనుమానం ఉన్న వారికి, గత అయిదు రోజులుగా కేసాంగ్‌ సిటీ వెళ్లినవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచుతారు.

ఆదివారం నాడు దక్షిణ కొరియా నుంచి అక్రమంగా సరిహద్దు గుండా ఉత్తరకొరియాలోని కేసాంగ్‌ సిటీకి వచ్చిన అనుమానిత కేసును ప్రాథమిక దశగా గుర్తించి, వెంటనే క్వారంటైన్‌కు పంపినట్టు కెఎన్‌సిఎ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments