ఉత్తర కొరియాలో ఎమర్జెన్సీ.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 27 జులై 2020 (09:43 IST)
ఉత్తర కొరియాలో తొలి కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో సరిహద్దు పట్టణమైన కెేసాంగ్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తొలి కేసు రాగానే కేసాంగ్‌ సిటీని పూర్తిగా లాక్‌డౌన్‌ చేశారు.

ఇతర జిల్లాలను, ప్రాంతాలను అప్రమత్తం చేశారు. కేసాంగ్‌లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితి దృష్ట్యా మహమ్మారి వ్యతిరేక ఎమర్జెన్సీ నుంచి గరిష్ట ఎమర్జెన్సీకి మారాలని, ఉన్నత స్థాయి హెచ్చరికను జారీ చేయాలని నిర్ణయించారు.

ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ (కెసిఎన్‌ఎ) తెలిపిన వివరాలను బట్టి కరోనా వైరస్‌ సోకినట్టుగా అనుమానం ఉన్న వారికి, గత అయిదు రోజులుగా కేసాంగ్‌ సిటీ వెళ్లినవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచుతారు.

ఆదివారం నాడు దక్షిణ కొరియా నుంచి అక్రమంగా సరిహద్దు గుండా ఉత్తరకొరియాలోని కేసాంగ్‌ సిటీకి వచ్చిన అనుమానిత కేసును ప్రాథమిక దశగా గుర్తించి, వెంటనే క్వారంటైన్‌కు పంపినట్టు కెఎన్‌సిఎ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments