ప్రపంచ కుబేరుడుగా మళ్లీ ఎలాన్ మస్క్!

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (14:00 IST)
ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ ఎలాన్ మస్క్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఆస్థానంలో ఉన్న ఎల్.వీ.ఎం.హెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్స్ సంపద 2.6 శాతం మేరకు తగ్గిపోవడంతో టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది.
 
గత డిసెంబరులో ఆర్నాల్ట్స్ తొలిసారి మస్క్‌ను దాటేసి మొదటిస్థానానికి చేరుకున్నారు. టెక్‌ ఇండస్ట్రీ భారీ ఒడుదొడుకులు ఎదుర్కోవడం, ట్విటర్‌ కొనుగోలు తర్వాత పరిణామాల నేపథ్యంలో టెస్లా షేరు విలువ అప్పట్లో భారీగా పతనమైంది. దీంతో మస్క్‌ వ్యక్తిగత సంపద తరిగిపోయింది. 
 
అదేసమయంలో కరోనా పరిస్థితులు చక్కబడడంతో విలాసవంత వస్తువుల కొనుగోళ్లు పుంజుకొన్నాయి. ఫలితంగా ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు రాణించాయి. తిరిగి ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు బలపడడంతో మళ్లీ లగ్జరీ వస్తువుల తయారీ సంస్థల షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి.
 
విలాసవంత వస్తువులకు పెట్టింది పేరైన ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు ఏప్రిల్‌ నుంచి 10 శాతానికి పైగా పడిపోయాయి. ఓ దశలో ఒక్కరోజులోనే ఆర్నాల్ట్స్ సంపదలో 11 బిలియన్‌ డాలర్లు ఆవిరయ్యాయి. మస్క్‌ సంపద మాత్రం ఈ ఏటా పెరుగుతూ పోతోంది. ట్విటర్‌ కొనుగోలు పరిణామాల నేపథ్యంలో కుంగిన టెస్లా షేర్లు కనిష్ఠాల నుంచి పుంజుకోవడమే ఇందుకు కారణం. 
 
మస్క్‌ వ్యక్తిగత సంపదలో 71 శాతం వాటా టెస్లా షేర్లదే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెస్లా షేర్లు 66 శాతం పుంజుకున్నాయి. దీంతో మస్క్‌ సంపద 55.3 బిలియన్‌ డాలర్లు పెరిగి ప్రస్తుతం 192.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అదేసమయంలో ఆర్నాల్ట్స్ సంపద రూ.186.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments