Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈక్వెడార్ జైల్లో ఘర్షణలు - 68 మంది ఖైదీల మృతి

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (19:12 IST)
ఈక్వెడార్ దేశంలోని జైలులో ఖైదీల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 68 మంది మృత్యువాతపడ్డారు. మరో 25 మంది ఖైదీలకు తీవ్రంగా గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన గ్వాయాక్విల్‌ నగరంలోని టిటోరల్‌ జైలులో జరిగింది. సెప్టెంబర్‌లో ఇదే జైలులో ఖైదీల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో 119 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. 
 
డ్రగ్స్‌ అక్రమ రవాణా ముఠాల మధ్య వివాదాలే హింసకు కారణంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు సుమారు వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దించారు. 
 
ఖైదీల నుండి పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జైలు నుండి భారీ పేలుడు రావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలుసుకునేందుకు భారీగా ఖైదీల బంధువులు అక్కడకు చేరుకున్నారు. జైలు వద్ద భయానక పరిస్థితులు నెలకొనివున్నాయి. జైలులో శవాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. 
 
ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, తుపాకులు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు లిటోలర్ జైలు అధికారి పేర్కొన్నారు. జైలు లోపల నుంచి చాలా సమయం పాటు పేలుళ్లు వినిపించాయని గాయాక్విల్​ నగరంలో లిటోలర్ జైలు సమీప ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కొందరు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments