Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈక్వెడార్ జైల్లో ఘర్షణలు - 68 మంది ఖైదీల మృతి

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (19:12 IST)
ఈక్వెడార్ దేశంలోని జైలులో ఖైదీల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 68 మంది మృత్యువాతపడ్డారు. మరో 25 మంది ఖైదీలకు తీవ్రంగా గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన గ్వాయాక్విల్‌ నగరంలోని టిటోరల్‌ జైలులో జరిగింది. సెప్టెంబర్‌లో ఇదే జైలులో ఖైదీల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో 119 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. 
 
డ్రగ్స్‌ అక్రమ రవాణా ముఠాల మధ్య వివాదాలే హింసకు కారణంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు సుమారు వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దించారు. 
 
ఖైదీల నుండి పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జైలు నుండి భారీ పేలుడు రావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలుసుకునేందుకు భారీగా ఖైదీల బంధువులు అక్కడకు చేరుకున్నారు. జైలు వద్ద భయానక పరిస్థితులు నెలకొనివున్నాయి. జైలులో శవాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. 
 
ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, తుపాకులు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు లిటోలర్ జైలు అధికారి పేర్కొన్నారు. జైలు లోపల నుంచి చాలా సమయం పాటు పేలుళ్లు వినిపించాయని గాయాక్విల్​ నగరంలో లిటోలర్ జైలు సమీప ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కొందరు తెలిపారు. 

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments