Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ టు భారత్... అండర్ వాటర్ హైస్పీడ్ రైలు.. నిజమా?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (09:33 IST)
అరబ్ దేశాల్లో ఒకటైన దుబాయ్ - భారత్‌లో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవలి కాలంలో మరింతగా బలపడ్డాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి భారత్‌కు రైలు మార్గం ఏర్పాటుకానుంది. అదీకూడా సముద్ర భూగర్భంలో ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ అండర్ వాటర్ హైస్పీడ్ రైలు మార్గం పూర్తయితే చరిత్రపుటలకెక్కనుంది. 
 
దుబాయ్‌లోని ఫుజురాయ్ నుంచి భారత్‌లోని ముంబై వరకు ఈ మార్గాన్ని నిర్మిస్తారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 2 వేల కిలోమీటర్ల వరకు దూరం ఉంది. ఇంతదూరం సముద్రగర్భంలోనే రైలు మార్గం నిర్మించి, ఈ మార్గంలో అండర్ వాటర్ హైస్పీడ్ రైలును నడుపనున్నారు. 
 
ఈ మేరకు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజరీ బ్యూరో కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్‌షేహీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలోపేతం అయ్యేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుందని.. వర్తకం మరింత అభివృద్ది చెందుతుందని అబ్దుల్లా చెప్పారు. 
 
వీటివల్ల ప్రజల అవసరాలతో పాటు ఇరు దేశాల ఎగుమతులు దిగుమతులకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఇటువంటి రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా, జపాన్‌లు చూస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments