Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ టు భారత్... అండర్ వాటర్ హైస్పీడ్ రైలు.. నిజమా?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (09:33 IST)
అరబ్ దేశాల్లో ఒకటైన దుబాయ్ - భారత్‌లో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవలి కాలంలో మరింతగా బలపడ్డాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి భారత్‌కు రైలు మార్గం ఏర్పాటుకానుంది. అదీకూడా సముద్ర భూగర్భంలో ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ అండర్ వాటర్ హైస్పీడ్ రైలు మార్గం పూర్తయితే చరిత్రపుటలకెక్కనుంది. 
 
దుబాయ్‌లోని ఫుజురాయ్ నుంచి భారత్‌లోని ముంబై వరకు ఈ మార్గాన్ని నిర్మిస్తారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 2 వేల కిలోమీటర్ల వరకు దూరం ఉంది. ఇంతదూరం సముద్రగర్భంలోనే రైలు మార్గం నిర్మించి, ఈ మార్గంలో అండర్ వాటర్ హైస్పీడ్ రైలును నడుపనున్నారు. 
 
ఈ మేరకు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజరీ బ్యూరో కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్‌షేహీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలోపేతం అయ్యేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుందని.. వర్తకం మరింత అభివృద్ది చెందుతుందని అబ్దుల్లా చెప్పారు. 
 
వీటివల్ల ప్రజల అవసరాలతో పాటు ఇరు దేశాల ఎగుమతులు దిగుమతులకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఇటువంటి రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా, జపాన్‌లు చూస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments