Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ టు భారత్... అండర్ వాటర్ హైస్పీడ్ రైలు.. నిజమా?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (09:33 IST)
అరబ్ దేశాల్లో ఒకటైన దుబాయ్ - భారత్‌లో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవలి కాలంలో మరింతగా బలపడ్డాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి భారత్‌కు రైలు మార్గం ఏర్పాటుకానుంది. అదీకూడా సముద్ర భూగర్భంలో ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ అండర్ వాటర్ హైస్పీడ్ రైలు మార్గం పూర్తయితే చరిత్రపుటలకెక్కనుంది. 
 
దుబాయ్‌లోని ఫుజురాయ్ నుంచి భారత్‌లోని ముంబై వరకు ఈ మార్గాన్ని నిర్మిస్తారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 2 వేల కిలోమీటర్ల వరకు దూరం ఉంది. ఇంతదూరం సముద్రగర్భంలోనే రైలు మార్గం నిర్మించి, ఈ మార్గంలో అండర్ వాటర్ హైస్పీడ్ రైలును నడుపనున్నారు. 
 
ఈ మేరకు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజరీ బ్యూరో కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్‌షేహీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలోపేతం అయ్యేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుందని.. వర్తకం మరింత అభివృద్ది చెందుతుందని అబ్దుల్లా చెప్పారు. 
 
వీటివల్ల ప్రజల అవసరాలతో పాటు ఇరు దేశాల ఎగుమతులు దిగుమతులకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఇటువంటి రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా, జపాన్‌లు చూస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments